వేధింపులు తాళలేక... శివాలెత్తిపోయింది

X
By - Subba Reddy |25 April 2023 12:30 PM IST
వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తరుచు అసభ్య మెసేజ్లు పంపుతుండటంతో వేధింపులు తట్టుకోలేక..
మంచిర్యాల జిల్లా ఇందారంలో దారుణం చోటు చేసుకుంది. నడి గ్రామంలో అందరూ చూస్తుండగానే రోడ్డుపై యువకుడి హత్య చేశారు. వివరాల్లోకి వెళితే పెళ్లైన యువతి భర్త ఆరు నెలల క్రితం మరణించాడు. దీంతో మహేష్ అనే యువకుడు ఆ వివాహితను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తరుచు అసభ్య మెసేజ్లు పంపుతుండటంతో వేధింపులు తట్టుకోలేక సదరు యువతి కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో మంగళవారం యువతి ఇంటి ముందు నుంచి బైక్పై వెళుతున్న మహేష్ హారన్ కొట్టడంతో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబ సభ్యులు అతడిని అడ్డగించారు. అనంతరం బండరాయితో మహేష్ తలపై విచక్షణారహితంగా మోది తలను ఛిద్రం చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com