Telangana : 12 మంది డీఎస్సీల బదిలీ

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 12 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ పోలీసు డైరక్టర్ జనరల్ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ డీటీసీ డీఎస్పీగా ఉన్న అనుముల శ్రీనివాస్ను హైదరాబాద్ ఈస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ-5గా అక్కడున్న సంపత్ కుమార్ ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న పురుషోత్తం రెడ్డిని ఇంటెలిజెన్స్ డీఎస్పీగా, సీఐడీకి బదిలీ చేసిన శ్రీనాధ్ రెడ్డిని డీఎస్పీ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నియమించారు. మెదక్ డీసీఆర్బీ డీఎస్పీ కొంతం చంద్రశేఖర్ రెడ్డిని మాదా పూర్ ట్రాఫిక్ ఏసీపీగా, అక్కడున్న కందుల సత్యనారాయణను డీజీపీ కార్యాలయానికి పంపించారు. సంగారెడ్డి డీసీఆర్బీ డీఎస్పీ రణ్వీర్ రెడ్డిని హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా, పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రామ్మోహన్ రెడ్డిని ఇంటెలిజెన్స్ కు పంపించారు. ఇంటెలిజెన్స్ ఉన్న భాస్కర్ను హైదరాబాద్ మీర్ చౌక్ ఏసీపీగా, అక్కడున్న వెంకటేశ్వర్ రావును డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏసీపీగా ఉన్న సాయిరెడ్డి వెంకట్ రెడ్డిని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి డీఎస్పీగా అక్కడున్న పల్లె వెంకటేశ్వర్లును డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com