12 మంది మావోయిస్టులు లొంగుబాటు

ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మా వోయిస్టులు సరెండర్ అవుతున్నారు. ఇవాళ కొత్తగూడెం ఎస్పీ ముందు 12 మంది మావో యిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళా మావోయి స్టులున్నారు. గత ఆరు నెలల్లో 294 మంది మా వోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు రూ. 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. క్యాడర్ల వారీగా రివార్డు నగదును వారి ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలను తీసుకుని మొత్తం రూ.26 లక్షలను చెక్కుల రూపంలో అందించనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆపరేషన్ చేయూత కార్యక్రా మనికి ఆకర్షితులై పలువురు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడానికి మొగ్గు చూ పుతున్నారని అన్నారు. సరిహద్దు గ్రామ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులకు సహకరించ కూడదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com