Hyderabad : నగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటలు నీటి సరఫరా బంద్

నగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటలు నీటి సరఫరా బంద్ కానున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ప్రకటించింది. కృష్ణా నీటి సరఫరా ఫేజ్-3లోని 2375 ఎంఎం డయామీటర్ ఎంఎస్ పంపింగ్ మెయిన్లో లీకేజీ ఏర్పడింది. దీంతో లీకేజీ సమస్యను పరిష్కరించడానికి మరమ్మతు పనులు చేపట్టారు అధికారులు. ఇందులో భాగంగా అక్టోబర్ 24వ తేదీన ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మరమ్మతు పనులు నిర్వహించనున్నారు. ఇదే విషయాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు వెల్లడించింది. నీటి పైపు మరమ్మతుల కారణంగా హైదరాబాద్లోని శాస్త్రిపురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్ పేట్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, ప్రశాసన్ నగర్, తట్టి ఖానా, లాలాపేట్, సైనిక్పురి, మౌలా అలీ, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరీ హిల్స్, వాసవీ నగర్, బద్లానగర్, సులేమాన్ నగర్, గోల్డెన్ హైట్స్, కస్మత్ పూర్, పెద్ద అంబర్ పేట్ ప్రాంతాలకు 24 గంటలు తాగునీటి సరఫరా బంద్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com