ఉద్యోగుల మూల వేతనం పెన్షన్‌పై 2.73 శాతం డీఏ పెంపు

ఉద్యోగుల మూల వేతనం పెన్షన్‌పై 2.73 శాతం డీఏ పెంపు
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం డీఏ విడుదల చేసింది.

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం డీఏ విడుదల చేసింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డీఏ విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఉద్యోగుల మూల వేతనం, పెన్షన్‌పై 2.73 శాతం డీఏ పెరగనుంది. పెరిగిన డీఏ 2023 జూన్ నుంచి అమల్లోకి రానుంది.

బకాయిలను తర్వాత విడుదల చేయనున్న ప్రభుత్వం జూన్ నెల వేతనం, పెన్షన్‌తో పాటు పెరిగిన డీఏను జూలైలో చెల్లించనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. డీఏ పెంపుతో 7.28 లక్షల మంది ఉద్యోగులు, పింఛనర్లకు ప్రయోజనం కలగనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. డీఏ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు 81.18 కోట్ల రూపాయలు ఏడాదికి 974.16 కోట్ల అదనపు భారం పడనుందని తెలిపారు. పెంచిన డీఏ ప్రకారం 13వందల 80 కోట్ల ఎరియర్స్‌ను ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story