గల్ఫ్ వర్కర్స్కు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా .. గైడ్ లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టింది. వారికి రూ. 5 లక్షల పరిహారం ప్రకటిస్తూ ప్రభుత్వం గైడ్ లైన్స్ను సోమవారం విడుదల చేసింది. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అనారోగ్యం, ఇతర సమస్యలతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనుంది. బహ్రేయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతార్, సౌది అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ దేశాల్లో 2023 డిసెంబర్ 7వ తేదీ తర్వాత మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇస్తారు. తెలంగాణకు చెందిన గల్ఫ్ మృతుల కుటుంబాలకు మాత్రమే ఎక్స్ గ్రేషియా ఇస్తారు. ఇందు కోసం గల్ఫ్ కార్మికుడి డెత్ సర్టిఫికెట్, క్యాన్సిల్ చేసిన పాస్ పోర్ట్, వర్క్ వీసా, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ లేదా ఆయా దేశాల్లో పని చేసినట్టు ఏదైనా నిర్దారణ సర్టిఫికెట్తో పాటు ఆయనపై డిపెండ్ అయిన కుటుంబ సభ్యుల బ్యాంక్ ఎకౌంట్తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అర్హులను ఎంపిక చేస్తారని, నేరుగా మృతుల కుటుంబ సభ్యుల బ్యాంక్ ఎకౌంట్లలోనే నగదు జమ చేస్తామని పేర్కొన్నారు. గల్ఫ్తో కార్మికుడు మృతిచెందిన లేదా కుటుంబ సభ్యులు డెడ్ బాడీని రిసీవ్ చేసుకున్న ఆరు నెలల్లోపే ఎక్స్ గ్రేషియా కోసం జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com