TG : రూ. 50 వేల విలువైన గంజాయి పట్టివేత

గంజాయిని వికయుస్తున్న ఓ వక్తిని హన్మకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి లక్ష యాభై వేల రూపాయల విలువ గల ఆరు కిలోల గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పీఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఏసీపీ దేవేందర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. కాజీపేట మండలం విష్ణుపురికి చెందిన ఫ్రాన్సియా ఆడం కారు డ్రైవర్ గా పని చేస్తూనే గంజాయి కి అలవాటు పడ్డాడు. తాను కూడా గంజాయి అమ్మి సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు.
ఇందుకోసం నిందితుడు గతంలో భద్రాచలంలో పరిచయం అయిన హుస్సేన్ అనే వ్యక్తి ద్వారా ఒడిషా నుండి గంజాయిని తెప్పించుకొని ట్రై సిటీ పరిధిలో గంజాయి అవసరమైన వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయించే వాడు. ఈ సందర్భంగా బుధవారం హంటర్ రోడ్డులోని కోడెం ఫంక్షన హల్ వద్ద సుబేదారి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడి వద్ద గంజాయి ని గుర్తించారు. నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com