Huzurabad By Election : ప్రధాన పార్టీలకు 72గంటల టెన్షన్..!

Huzurabad By Election : హుజరాబాద్లో ఇప్పుడు ప్రధాన పార్టీలకు 72గంటల టెన్షన్ పట్టుకుంది. పోలింగ్ 72 గంటల ముందు నాన్ లోకల్ లీడర్స్ అందరూ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ తరుపున చేసిన మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి ఇలా మంత్రులు ప్రచారం నిర్వహించారు. వీరంతా నాన్ లోకల్.. 72 గంటల ముందు హుజురాబాద్ వదిలి వెళ్లిపోవాలి. లోకల్ లీడర్స్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబ సభ్యులు, కౌశికు రెడ్డి, వినోద్, పెద్దిరెడ్డి మాత్రమే టీఆర్ఎస్ తరపున హుజురాబాద్ లో వుంటారు. బీజేపీకి ఈటెల వర్గీయులు మాత్రమే అండ.. ఇక కాంగ్రెస్ నాయకులు అంతా నాన్ లోకల్ .. అభ్యర్థి కూడా నాన్ లోకల్...లో ఉన్నాడు.. సో బల్మూర్ వెంకట్ ఒక్కడే పోలింగ్ దాక ఉండే పరిస్థితి. మొత్తానికి మూడు పార్టీలకి 72 గంటల టెన్షన్ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com