Medaram: మేడారం జాతరలో విషాదం.. మూర్చతో క్యూలైన్‌లో మృతిచెందిన భక్తుడు..

Medaram: మేడారం జాతరలో విషాదం.. మూర్చతో క్యూలైన్‌లో మృతిచెందిన భక్తుడు..
Medaram: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో విషాదం నెలకొంది.

Medaram: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో విషాదం నెలకొంది.. అమ్మవార్ల దర్శనం కోసం వచ్చిన ఓ వ్యక్తి మూర్ఛతో కుప్పకూలిపోయాడు.. క్యూలైన్‌లోనే ప్రాణాలు వదిలాడు.. మృతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన వెంకట నారాయణగా గుర్తించారు.. అటు అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.. జాతరకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.. ఇవాళ ఒక్కరోజే 50వేలమంది భక్తులు దర్శనం చేసుకున్నారు.. ఇక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story