TG : మాజీ ఐఏఎస్ అమోయ్ కుమార్ వ్యవహారంలో ట్విస్ట్

X
By - Manikanta |9 Nov 2024 7:45 PM IST
మాజీ IAS అమోయ్కుమార్ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో 42 ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టడంలో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు, డీజీపీ జితేందర్ను కలిశారు. ఈ వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టర్ అమోయ్కుమార్ పాత్రపై దర్యాప్తు చేయాలని కోరింది. ఇందుకు గాను కేసులు నమోదు చేసేలా స్థానిక పోలీసులను ఆదేశించాలని కోరారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అమోయ్కుమార్ కలెక్టర్గా పనిచేసిన సమయంలో జరిగిన భూ లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదులపైనా దర్యాప్తు జరపాలని కోరింది. పలువురు బాధితులు తమకు ఇప్పటికే చేసిన 12 ఫిర్యాదుల వ్యవహారాన్ని డీజీపీ దృష్టికి ఈడీ అధికారులు తీసుకెళ్లారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com