Suicide : ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

X
By - Manikanta |30 Oct 2024 7:30 PM IST
తండ్రి స్మార్ట్ పోన్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ పి.మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పల్లివాడ గ్రామానికి చెందిన మహంకాళి నర్సింహ్మను, కుమారుడు(15) స్మార్ట్ పోన్ అడగడంతో డబ్బులు లేవని కొద్దిరోజులు ఆగాలని తండ్రి చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు ఇంట్లో ఎవరులేని సమయంలో చీరతో ఉరివేసుకొని మృతి చెందాడు. ఈమేరకు ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నానని రామన్నపేట ఎస్ఐ ఒక ప్రకటనలో తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com