Shivabalakrishna : శివబాలకృష్ణ బినామీలకు నోటీసులు ఇచ్చిన ఏసీబీ

Shivabalakrishna : శివబాలకృష్ణ బినామీలకు నోటీసులు ఇచ్చిన ఏసీబీ

హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ (Siva Bala Krishna) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ ,భరణిలకు నోటీసులు అందజేసింది. ఇవాళ ఈ ముగ్గురిని ఏసీబీ విచారించబోతున్నది. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు విచారణకు హాజరు కావాలని ముగ్గురికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దర్యాప్తులో లభించిన ఆధారాలు, సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా విచారణ చేయనుంది ఏసీబీ. మరోవైపు బాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేయాలని కలెక్టర్‌కు ఏసీబీ లేఖ రాసింది.

మరోవైపు ఆయనకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్‌ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ సిద్ధమైంది. ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకోనుంది ఏసీబీ. ఇదిలా ఉంటే.. 2021-23 సంవత్సరాల మధ్య శివబాలకృష్ణ కోట్ల ఆస్తుల్ని కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అయితే ఆ ఆస్తులన్నింటినీ ఆయన తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్టర్‌ చేయించారు.ఈ క్రమంలో యాదాద్రిలో 57 ఎకరాల భూమిపై ప్రత్యేక విచారణ చేయాలని ఏసీబీ భావిస్తోంది.

కాగా ఆదాయానికి మించి ఆస్తుల సంపాదన కేసులో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హెచ్‌‌ఎమ్‌‌డీఏ టౌన్‌‌ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా పనిచేసిన సమయంలో ఆయన భారీగా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. గత పన్నెండేళ్లలో శివబాలకృష్ణ ఆదాయం రూ.2.48 కోట్లు కాగా.. ఆయన ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారమే రూ.8.26 కోట్లుగా ఏసీబీ గుర్తించింది.

శివబాలకృష్ణ హెచ్‌‌ఎండీఏలో 2018 నుంచి గతేడాది వరకు టౌన్‌‌ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా విధులు నిర్వహించాడు. ప్రస్తుతం రేరా సెక్రటరీగా పనిచేస్తున్నాడు. గతంలో మున్సిపల్‌‌అడ్మినిస్ట్రేషన్‌‌ అండ్ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా పనిచేశాడు. ఆ సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story