KTR : కేటీఆర్ కు మళ్లీ ఏసీబీ నోటీసులు

X
By - Manikanta |14 Jun 2025 12:00 PM IST
ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని చెప్పింది. ఫార్ములా- ఈ రేసు కేసులో విచారణకు హాజరుకావాలని తెలిపింది. మే 26నే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. విదేశీ పర్యటన షెడ్యూల్ ఉందని.. తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. తాజాగా ఇప్పుడు విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com