ACB Raids : మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు

సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు తనిఖీ చేశారు. ఓ కేసు తొలగిం పునకు లంచం డిమాండ్ చేసినట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో పోలీస్ హోంగార్డు సంతోష్ ను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన వ్యక్తి తన వ్యక్తిగత పనుల నిమిత్తం దుబ్బాక మున్సిపాలిటీ పరిధి లచ్చపేట నుంచి మిరుదొడ్డి మీదుగా హైద రాబాద్ కు వెళుతున్న క్రమంలో మిరుదొడ్డి శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి స్థానికుడైన రాజు వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అదే రోజు రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే క్రమంలో హెూంగార్డు సంతోష్ ఫిర్యాదు దారుడు రాజు పరస్పర సమ్మతితో వ్యవ హారం సర్దుబాటు చే స్తానన్నారు. ఇందుకు గానూ రూ.15 వేలు లంచం ఇవ్వాలని హోంగార్డు సంతోష్ డిమాండ్ చేశారు. చివరకు రూ. 10 వేలకు ఒప్పందం కుదు ర్చుకున్నారు. లంచం అడగడంపై అసంతృప్తి చెందిన అమీర్ ఏసీబీ అధి కారులను ఆశ్రయించాడు. అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఒప్పంద ప్రక్రియలో హోంగార్డు సంతోష్ రూ.2 వేలు స్వీకరించారు. మిగతా రూ.8 వేలను పరోక్షంగా ముట్టజెప్పాలని సూచించారు. అందులో గ్రామానికి చెందిన హెూటల్ నిర్వాహకుడికి రూ.2 వేలు, మద్యం దుకాణ కార్మికు డికి రూ.3 వేలు, ద్విచక్ర వాహన మరమ్మత్తుదారుకు మరో రూ.3 వేలు రాజుకు ఇవ్వాలని సూచించారు. మిగిలిన రూ.2 వేలు ఫిర్యాదుదారుడి వద్ద ఉన్నాయి. లంచం వ్యవహారంలో ముగ్గురిని ఏసీబీ అధికారులు అదు పులోకి తీసుకొని మిరుదొడ్డి స్టేషన్ లో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై హోంగార్డు సంతోష్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com