Srisailam : శ్రీశైలంలో అన్ని గేట్లు ఎత్తివేత.. సాగర్ వైపు కృష్ణమ్మ బిరబిరా

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. సోమవారం 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు.. దశలవారీగా అన్ని గేట్లు ఎత్తారు. దీంతో మొత్తం 10 గేట్ల ద్వారా నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్ వైపు ప్రవహిస్తోంది.
ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిద్వారా కూడా నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువనున్న జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1.27 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఔట్ ఫ్లో 2.21లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. మంగళవారం సాయంత్రానికి 883.5 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు ఉండగా.. 207.04 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం స్పిల్ వే ద్వారా 2.06 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com