AP : ఏపీకి ఆమ్రపాలి... సీఎం రేవంత్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు?

X
By - Manikanta |11 Oct 2024 12:30 PM IST
తెలంగాణలో పని చేస్తున్న 11 మంది ఐఏఎస్, ఐపీఎస్లకు కేంద్రం షాకిచ్చింది. తెలంగాణలో పని చేసే అవకాశం ఇవ్వాలన్న 11 మంది సివిల్ సర్వీసెస్ అధికారుల వినతిని తిరస్కరించింది. వెంటనే సొంత రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని 11 మంది అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రెండు రాష్ట్రాల సీఎస్ లకు ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి రోనాల్డ్ రాస్ కు కేంద్రం నిర్ణయంతో షాక్ తగిలింది. ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్ తో ఐఏఎస్లు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ప్రశాంతి ఏపీకి వెళ్లనున్నారు. తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్, అభిలాష్ కూడా ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో సీఎం రేవంత్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com