Suicide : నారాయణ కాలేజీలో ఇంటర్ స్టూడెంట్ మృతి

Suicide : నారాయణ కాలేజీలో ఇంటర్ స్టూడెంట్ మృతి
X

బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అనూష(16) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా వీరిలో రెండో కుమార్తె అనూష (16) బాచుపల్లి చౌరస్తాలోని నారాయణ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుంది. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన అనూషను ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులు హాస్టల్లో వదిలి వెళ్లారు. తల్లిదండ్రులు నగరం దాటేలోపే అనూష స్పృహ కోల్పోయిందని కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లేసరికి అనూష ఊరి వేసుకొని చనిపోయిందని నారాయణ సిబ్బంది తెలిపారు. తల్లిదండ్రులు వచ్చేసరికి విద్యార్థిని మృతదేహాన్ని కాలేజీ సిబ్బంది, బాచుపల్లి పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. తమ బిడ్డ అనూష ఆత్మహత్యకు నారాయణ కాలేజీ సిబ్బందే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనూష మృతిపై ఆమె తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాచుపల్లి నారాయణ కాలేజీ ముందు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యార్థిని బంధువులు నారాయణ కాలేజీలో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Tags

Next Story