Telangana : నలుగురు ఆర్టీఐ కమిషనర్ల నియామకం

రాష్ట్రంలో నలుగురు సమాచార హక్కు కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ శ్రీనివాస్, పర్వీస్ మొహిసిన్, దేశాలభూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డి ఆర్టీఐ కమిషనర్లుగా నియమితులయ్యా రు. ఇప్పటికే ఛీఫ్ కమిషన్ గా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరిం చారు. ఈ నెల 5న ప్రభుత్వం ఏడుగురి పేర్లను రికమండ్ చేస్తూ గవర్నర్ కు లేఖ రాసింది. వారిలో కప్పర హరి ప్రసాద్, రాములు, వైష్ణవి పేర్లు లేవు. మొదట పంపిన జాబితాలో పీవీ శ్రీనివాస్, బోరెడ్డి అయోధ్య రెడ్డి, పర్వీన్ మొహిసిన్ పేర్లు మాత్రమే ఉన్నాయి. దేశాల భూపాల్ పేరు కొత్తగా చేరింది. సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లి ఆర్టీఐ కమిష నర్ల నియామకంపై గవర్నర్ తో చర్చించినట్టు ప్రచారం జరిగిన గంటల వ్యవధిలో ఉత్తర్వు లు వెలువడ్డాయి. అయితే పాత వారిని జాబి తాలోంచి తొలగించారా..? లేక ఆపారా..? అన్నది తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com