TG : రైతు కమిషన్ నూతన సభ్యుల నియామకం

X
By - Manikanta |22 Oct 2024 5:30 PM IST
కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రైతు కమిషన్ కు నూతన సభ్యలను నియమించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో రైతు కమిషన్ చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోదండ రెడ్డిని నియమిస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా సభ్యులను కూడా నియమించింది. ఏడుగురు సభ్యులతో కూడిన రైతు కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ రైతు కమిషన్ లో గతంలో ఆరుగురు సభ్యులు ఉండగా.. ఈ సారి ఆ సంఖ్య ఏడుకు సవరించింది. ఇందులో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, న్యాయవాది సునీల్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, కె.వి.నర్సింహారెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, మరికంటి భవాని సభ్యులుగా నియామకం అయ్యారు. వీరు రెండేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com