Formula E Race Case : ఫార్ములా ఈ రేస్ కేసు .. అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు

Formula E Race Case : ఫార్ములా ఈ రేస్ కేసు .. అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు
X

ఫార్ములా ఈ రేసు కేసులో ఏ2గా ఉన్న అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రి న్సిపల్ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో జులై1న విచారణకు రావాలని ఆదేశించింది. అరవింద్ కుమార్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన విదేశాల నుంచి జూన్ 30వ తేదీన హైదరాబాద్ చేరు కుంటారు. మరుసటి రోజే విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ను ఇప్పటికే ఏసీబీ రెండు సార్లు విచారించింది. ఈ నెల 16న కేటీఆర్ ను ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. 60కి పైగా ప్రశ్నలు వేసి ఆయన నుంచి వివరాలు రాబట్టా రు. ఆయన చెప్పిన సమాధానాల ఆధారంగా స్టేట్ మెంటను రికార్డు చేశారు. వాటి అరవింద్ కుమార్ ను ప్రశ్నించనున్నారని తెలుస్తోంది.

Tags

Next Story