Telangana Assembly : నేటి నుంచి అసెంబ్లీ.. సభ ముందుకు రెండు బిల్లులు

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో నేడు పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఉ.10 నుంచి 11 వరకు తొలుత ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సభ్యులు సంతాపం తెలియజేస్తారు. ఈరోజు సభలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీల సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9న ప్రారంభమైన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం సభ్యుల మధ్యనే తెలంగాణ తల్లిపై స్వల్పకాలిక చర్చ కొనసాగింది. ఆ తర్వాత ఇవాళ్టికి ఉభయ సభలు వాయిదా పడ్డాయి. వారం తర్వాత పునర్ ప్రారంభమవుతున్న సమావేశాలు ఈ నెల 21 వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. సభ పని దినాలు, చర్చించాల్సిన అంశాలపై నేడు జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. శాసనసభ మొదలు కాగానే గంటపాటు ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఆ తర్వాత ఇటీవల మృతి చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతి దేవి, ఊకె అబ్బయ్య, రామచంద్రారెడ్డికి సంతాపం ప్రకటిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com