TG : అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవికి ఎమ్మెల్సీ అభ్యర్థి హరికృష్ణ రాజీనామా

X
By - Manikanta |29 Oct 2024 3:30 PM IST
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపద్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోనీ ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో తన అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్న హరికృష్ణ పదవికి రాజీనామా చేసిన అనంతరం రాజీనామా లేఖను ప్రిన్సిపల్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దాదాపు రెండు దశాబ్దాల తన ఉద్యోగ ప్రస్థానంలో విద్యార్థుల భవితకు తన వంతు కృషి చేయడం జరిగిందని, ఎమ్మెల్సీ పదవి కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు కాదని, ఆరు సంవత్సరాలు పట్టబద్రులకు సమస్యలు వస్తే సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి, పట్టభద్రులకు ఒక ప్రతినిధిగా ఉంటానని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com