వినాయకనగర్లో టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు పై దాడి!

X
By - Admin |20 Dec 2020 12:19 PM IST
రంగారెడ్డి జిల్లా రాజేందర్నగర్లో టీఆర్ఎస్ నేతపై దాడి జరిగింది. వినాయక నగర్లో నివాసం ఉంటున్న టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు చైతన్య రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.
రంగారెడ్డి జిల్లా రాజేందర్నగర్లో టీఆర్ఎస్ నేతపై దాడి జరిగింది. వినాయక నగర్లో నివాసం ఉంటున్న టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు చైతన్య రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో చైతన్య రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసంమైంది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు పిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్నారు మైలార్దేవుపల్లి పోలీసులు. నిన్న బీజేపీ-టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ ఘటన మరువకముందే మరో దాడి జరగడం కలకలం రేపుతోంది. గ్రేటర్ ఎన్నికల సమయం నుంచీ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది..
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com