Bandi Sanjay: డిప్రెషన్లో కేసీఆర్ తిక్కతిక్కగా మాట్లాడుతున్నారు: బండి సంజయ్
By - Divya Reddy |28 April 2022 7:15 AM GMT
Bandi Sanjay: ప్లీనరీ సమావేశాలు బీజేపీని తిట్టడానికే పెట్టారంటూ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ విరుచుకుపడ్డారు
Bandi Sanjay: ప్లీనరీ సమావేశాలు బీజేపీని తిట్టడానికే పెట్టారంటూ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ టీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ప్లీనరీలో పార్టీ సంస్థాగత విషయాలు చర్చిస్తారు.. అధికార పార్టీ ఇచ్చిన హామీలు, చేసిన పనులు చెప్పుకుంటారు.. కానీ ఏం చేయలేదు కాబట్టే.. ఏం చెప్పుకోలేదని మండిపడ్డారు. డిప్రెషన్లో కేసీఆర్ తిక్కతిక్కగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చేశారన్న సంజయ్.. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటే.. ఆ టెంట్ కిందకు ఎవరూ రాలేదన్నారు. కేసీఆర్.. బీఆర్ఎస్ కాదు.. అంతర్జాతీయ రాష్ట్ర సమితి పెట్టుకోవాలంటూ ఎద్దేవా చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com