సెంచరీ కొట్టిన పీపుల్స్‌ మార్చ్ పాదయాత్ర

సెంచరీ కొట్టిన పీపుల్స్‌ మార్చ్ పాదయాత్ర
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్ పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుంది. నేటితో భట్టి పాదయాత్ర వందో రోజుకు చేరుకుంది.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్ పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుంది. నేటితో భట్టి పాదయాత్ర వందో రోజుకు చేరుకుంది. మార్చి 16న ఆదిలాబాద్‌ జిల్లా పిప్పిరి గ్రామంలో ప్రారంభమైన పాదయాత్ర.. నిర్వీరామంగా కొనసాగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. నేనున్నాని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు 15 జిల్లాల్లోని 32 నియోజకవర్గల్లో భట్టివిక్రమార్క పాదయాత్ర చేశారు. మొత్తంగా 750కి పైగా గ్రామాల్లో పర్యటించి.. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 1150 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు.

ఇవాళ నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో భట్టివిక్రమార్క పాదయాత్ర కొనసాగనుంది. ఉదయం 7గంటల 30 నిమిషాలకు కేతేపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. కేతేపల్లి, చీకటి గూడెం, ఉప్పల్ పహాడ్, భాగ్యనగరం, కొప్పోలు గ్రామాల్లో నేడు పాదయాత్ర సాగనుంది. ఇక ఉప్పల్ పహాడ్ గ్రామంలో లంచ్ బ్రేక్ తీసుకుంటారు భట్టి. ఇక రాత్రికి కొప్పోలు చేరుకుని అక్కడే బస చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story