YS Sharmila : వైఎస్ షర్మిల బృందంపై తేనెటీగల దాడి

X
By - TV5 Digital Team |23 March 2022 5:30 PM IST
YS Sharmila : వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల బృందంపై తేనెటీగలు దాడి చేశాయి.
YS Sharmila : వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. యాదాద్రి జిల్లాలోని మోట కొండూరు మండలం నుంచి పాదయాత్రగా ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో వైఎస్ షర్మిల దుర్శగానిపల్లి గ్రామం వద్ద చెట్టుకింద ఆగి, గ్రామస్తులతో మాట్లాడుడారు. సరిగ్గా ఆదే సమయంలోనే పెద్ద తేనెటీగల గుంపు దాడి చేసింది. అయితే ఈ తేనె తీగల దాడి నుంచి వైయస్ షర్మిల బయటపడ్డారు. ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది, వైఎస్సార్టీపీ శ్రేణులు తమ కండువాలనే ఆయుధాలుగా గాల్లోకి ఊపుతూ ఈగలను తరిమేశారు. తేనెటీగల దాడిలో పార్టీ కార్యకర్తలు పలువురికి గాయాలయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com