Hyderabad Metro : బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. హైదరాబాద్ మెట్రోపై పిల్

X
By - Manikanta |23 April 2025 7:00 PM IST
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు టాలీవుడ్ టాప్ సెలెబ్రెటీలకు కూడా పోలీసుల నుంచి నోటీసులు అందాయి. తాజాగా హైదరాబాద్ మెట్రో రైళ్లలోనూ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసారంటూ మంగళవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎంతో బాధ్యతాయుతంగా ఉండాల్సిన మెట్రో రవాణా సంస్థ ఇలాంటి ఇల్లీగల్ పనులకు పాల్పడటంపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది నాగూర్ బాబు హైకోర్టులో పిల్ వేశారు. ఈక్రమంలో పిటిషన్లో కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ సీఎస్, డీజీపీ, మెట్రో ఎండీ, ఈడీలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com