BJP: టీఆర్ఎస్‌పై కోర్టు కేసులు వేసేందుకు బీజేపీ సిద్ధం..

BJP: టీఆర్ఎస్‌పై కోర్టు కేసులు వేసేందుకు బీజేపీ సిద్ధం..
BJP: 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా దూకుడు పెంచుతున్న బీజేపీ.. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది.

BJP: 2023 ఎన్నికలు, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడు పెంచుతున్న బీజేపీ.. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోర్టులలో కేసులు వేసేందుకు సిద్ధం అవుతోంది. అమలు కాని కేసీఆర్ హామీల అంశాలతో జాబితాను రెడీ చేస్తున్న బీజేపీ నాయకులు.. కేంద్ర, రాష్ట్ర నిధులపై గ్రామాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. 25 వేల ఆర్టీఐ దరఖాస్తులు అప్లై చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే 9 జిల్లాల్లోని గ్రామాలకు దరఖాస్తులు చేసిన బీజేపీ నేతలు.. కేంద్రం నుంచి ఏఏ పథకాలకు ఎన్ని నిధులు వచ్చాయి? టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో లెక్కలు తీస్తున్నారు. ఇప్పటికే కొన్ని అంశాలపై సమాధానాలు రాబట్టింది బీజేపీ నాయకత్వం. వచ్చిన సమాధానాల ఆధారంగా కోర్టులలో కేసులు వేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story