BJP MP Laxman : దిగజారుడు రాజకీయాలు మానుకో.. సీఎం రేవంత్పై లక్ష్మణ్ ఫైర్

సీఎం రేవంత్ రెడ్డివి దిగజారుడు వ్యాఖ్యలని, తన పర్సనల్ అడ్వకేట్ ద్వారా సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పుకునే పరిస్థితులు తెచ్చుకున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అగౌరవపరిచేలా మాట్లాడి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ నాగోల్ శుభం కన్వెన్షన్ హాల్లో వివిధ మోర్చాల సభ్యత్వ నమోదు వర్క్ షాప్ కు ఆయన హాజరై మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పునకు, బీజేపీకి ముడిపెట్టి రేవంత్ మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. వన్ నేషన్, వన్ లా దేశానికి అవసరమని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ 30 శాతం ఓట్లు సాధించుకుందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పట్టు పెరుగుతోందని ధీమా వ్యక్తంచేశారు. సభ్యత్వ నమోదు నూతన ఒరవడికి నాంది కావాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆకాంక్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com