Train Accident : గొర్రెలకు మేత తెస్తుండగా.. రైలు ఢీకొని అన్నదమ్ముల మృతి

గొర్రెల కోసం మేత తెస్తుండగా రైలు ఢీకొని ఇద్దరు సోదరులు చనిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ లోని యాకుత్ పురా రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.. యాకు త్పురా ప్రాంతానికి చెందిన షాబుద్దీన్ (26), ఫైజాన్ (21) ఇద్దరు యువకులు తమ గొర్రె లను మేత కోసం సమీపంలోని రైల్వే స్టేషన్ ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలోనే రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న చెట్టు కొమ్మలను కొట్టేందు కు అన్నదమ్ములు ఇద్దరు చెట్టు ఎక్కగా.. కొమ్మ విరిగి నేరుగా పట్టాలపై పడిపోయారు. అదే సమయంలో ట్రాక్పైకి అతివేగంతో వచ్చిన ట్రైన్ ఆ ఇద్దరు యువకులను బలంగా ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ స్పాట్ లోను చనిపో యారు. ఘటనాస్థలికి చేరుకున్న కాచిగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సాహెబుద్దీన్ ఎలక్ట్రిక్ పనులు చేయగా, ఫైజాన్ వెల్డింగ్ పని చేస్తూ కుటుం బానికి ఆసరాగా ఉండేవాళ్లు. చేతికందిన కొడుకులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com