BRS Leaders : హైడ్రా ఆఫీసర్లపై బీఆర్ఎస్ నేతల దాడి యత్నం

బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి, ఇతర వ్యక్తులు హైడ్రా అధికారులను అడ్డుకున్నారు. హైడ్రా సీఐ తిరుమలేష్ పై దాడికి యత్నించారు. బోయపల్లి కాలనీ వాసులు బోయపల్లి వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డిపై హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. 1982 జీపీ లేఔట్ చేసి ప్లాట్లను విక్రయించారని ఆరోపణలున్నాయి. సర్వే నెంబర్ 39,4041,42,44 లో మొత్తం 5 ఎకరాలు ఏడు గుంటల భూమి ఉంది. లేఅవుట్ లో 236 గజాల పార్కు స్థలం కబ్జా చేశారు భూ యజమానులు. లేఔట్ లో మూడు రోడ్లను కాలనీ వాసులకు భూ యజమానులు చూపించారు. రోడ్లు మూసి వేయడంతో కాలనీ నివాసులు ఇబ్బందులు పడ్డారు ఈ మేరకు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దాదాపు 40 మంది హైడ్రా అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక పోలీసులకు బందోబస్తు సమాచారం ఇచ్చినట్టు హైడ్రా అధికారి తిరుమలేష్ తెలిపారు. బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు హైడ్రా అధికారి తిరుమలేష్ వివరణ ఇచ్చారు. అధికారులు అడ్డుకున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేస్తే వాటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తిరుమలేష్ వెల్లడించారు. కాగా.. కాలనీ వాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పట్టాదారుల నుంచి తమకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com