TG : ఆటోల్లో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఆటోలలో అసెంబ్లీకి వచ్చారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఆ తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
"కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా 8 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఎన్నెన్నో హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఏవీ అమలు కాలేదు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 93 మంది ఆటో డ్రైవర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల జాబితాను ఇచ్చాం. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్న పోతు మీద వాన పడ్డేట్టే ఉంది. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లను ఎన్నికల కోసం వాడుకున్న ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలన్నింటిని మర్చిపోయింది. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లకి ఇస్తామని చెప్పిన 12 వేల ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రకటించాలి. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామన్న హమీని వెంటనే అమలు చేయాలి. ఆటోడ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. బీ ఆర్ ఎస్ పక్షాన వారి కోసం పోరాడతాం. ఆటోడ్రైవర్ల కు సంఘీభావంగా మేము ఆటోల్లో అసెంబ్లీ కి వెళుతున్నాం వారి యూనిఫామ్ లు ధరించి వచ్చాం. అటో డ్రైవర్లకు వారి బిఅర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుంది." అని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com