TG : గూడెంపై దాడి కేసులో 42 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు

X
By - Manikanta |25 Jan 2025 12:00 PM IST
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి ఘటనపై కేసు నమోదు అయ్యింది. 42 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలపై పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై ముట్టడి చేసి, కుర్చీలను కాంగ్రెస్ శ్రేణులు విరగొట్టాయి. పటాన్ చెరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సిబ్బంది ఫిర్యాదుతో సెక్షన్ 49, క్లాజ్ 3. 190 కింద కేసులు నమోదు చేశారు. మరి కొంత మందిపై కేసులు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com