Gachibowli Land Inspection : కంచ గచ్చిబౌలి భూముల్లో కేంద్ర కమిటీ సందర్శన

X
By - Manikanta |10 April 2025 3:45 PM IST
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ భూములను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నియమించిన పర్యావరణ అటవీ శాఖ సాధికారిక కమిటీ గచ్చిబౌలి భూములను పరిశీలించింది. సుప్రీం నియమించిన ఈ కమిటీ బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంది. హోటల్ తాజ్ కృష్ణాలో బస చేసిన కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, మరో ముగ్గురు సభ్యులు గురువారం ఉదయం 9 గంటలకు హోటల్ తాజ్ కృష్ణా నుంచి బయలుదేరి 10 గంటలకు గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లింది. కంచ గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవ పరిస్థితుల అధ్యయనం చేసింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ అంశాలను ఆరా తీసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com