టీఆర్ఎస్ నేతలు అల్లర్లకు పాల్పడుతున్నారు : కిషన్రెడ్డి
By - kasi |1 Dec 2020 2:15 AM GMT
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందనే భయంతోనే.. టీఆర్ఎస్ నేతలు అల్లర్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి. టీఆర్ఎస్ అనైతిక విలువలను పాటిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్.. రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు. నోట్లు, మద్యం పంపిణితో ఓట్లు అడగటం సరికాదని, పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ ఊడిగం చేయకూడదన్నారు కిషన్రెడ్డి. బీజేపీ నేతలపై దాడుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com