HYDRA : హైడ్రా రంగనాథ్కు మరో సంచలన బాధ్యత అప్పగించిన సీఎం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఆక్రమించి కట్టిన కట్టడాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఏమాత్రం తగ్గేది లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో ప్రధాన బాధ్యతను అప్పగించనున్నట్లు సమాచారం.
రేవంత్ సర్కారు హైడ్రాను మరింత స్ట్రెంతెన్ చేసింది. HMDA పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన గతంలో లేక్స్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి ఛైర్మన్గా ఏవీ రంగనాథ్ను నియమించనున్నట్లు తెలుస్తోంది. HMDA లో పరిధిలో ఏడు జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కమిషనర్కు అప్పగించాలని చూస్తున్నట్లు తెలిసింది. ఆక్రమణలకు గురి కాకుండా కాపాడవచ్చని సర్కార్ ఆలోచిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com