Khammam : ఖమ్మంకు సీఎం రేవంత్ రెడ్డి.. వరద పరిస్థితిపై నేరుగా పరిశీలన

X
By - Manikanta |2 Sept 2024 2:31 PM IST
భారీ వర్షాలు ఖమ్మంను ముంచెత్తాయి. ఒక్కసారిగా ఉప్పంగిన వరదతో ఖమ్మం పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకుంది. డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఖమ్మంలో పరిస్థితి దారుణంగా మారటంతో... వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ). ముందుగా కమాండ్ కంట్రోల్ రూంకు వెళ్లనున్న సీఎం రేవంత్.....అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఖమ్మంకు బయలుదేరనున్నారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com