Revanth Reddy : మధుయాష్కిగౌడ్ కి సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ

Revanth Reddy : మధుయాష్కిగౌడ్ కి సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ
X

అస్వస్థతకు గురై గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ను సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన కారణాలను తెలుసుకున్నారు. సెక్రటేరియట్ లో మధుయాష్కీ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న సీఎం .. వెంటనే స్పందించి AIG ఆస్పత్రిలో చేరేంత వరకు వారి సిబ్బంది, అధికారులకు సూచనలు చేసి మానిటరింగ్ చేశారు. AIG ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో సీఎం మాట్లాడి.. మధుయాష్కీకి అందిస్తున్న చికిత్స పై ప్రత్యేక పర్యవేక్షణ ఉండేలా చూడాలని సూచించారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సీఎం రేవంత్ నేరుగా మధుయాష్కి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించి.. పరామర్శించిన సీఎంకి మధుయాష్కి కృతజ్ఞతలు తెలిపారు. కాగా పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,, మంత్రులు ఉత్తమ్ , పొన్నం, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి , వాకిటి శ్రీహరి తదితర రాజకీయ ప్రముఖులు ఫోన్లో పరామర్శించారు.

Tags

Next Story