Kishan Reddy : కాంగ్రెస్ కు అబద్దాల్లో ఆస్కార్ ఇవ్వొచ్చు : కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో బీజేపీ పార్టీ ముందుకు కెళ్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో వాజ్ పేయ్ శతజయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కోసం మాట్లాడటం దారుణమన్నారు. అంబేద్కర్ కు అడుగడుగునా అవమానించిన కాంగ్రెస్ కు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అబద్ధాలల్లో కాంగ్రెస్ పార్టీకి అస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. 1954 నుంచి 88 వరకు నెహ్రు, ఇందిరగాంధీ సహా 21 మందికి భారత రత్న ఇచ్చారని, కానీ అంబేద్కర్ ను ఎందుకు విస్మరించిందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ. అబద్ధాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్. దేశ ప్రజల స్ఫూర్తి ప్రదాత వాజ్ పేయీ. భారత దేశ వైభవాన్ని, నైతిక విలువలకు ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన ఎప్పుడూ పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పని చేశారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోయినా ప్రజాతీర్పు కోరి మళ్లీ అధికారంలోకి వచ్చారు. మోదీ ప్రభుత్వం వాజ్ పేయ్ ఆశ యాలను తూచ తప్పకుండా అమలు చేస్తుంది' అని బండి సంజయ్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com