TG : హైదరాబాద్ లో మళ్లీ 'గాడిదగుడ్డు' ప్లెక్సీలు

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ హైదరాబాద్ నగరంలో పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ బ్యానర్లను ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేసింది. 'బీజేపీకి తెలంగాణ 8 ఎంపీ సీట్లు ఇస్తే.. కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు' అంటూ ఇచ్చిందంటూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై వినూత్న రీతిలో ప్లెక్సీలను ఏర్పాటు చేసి నిరసన తెలిపింది.
అటుగా వెళ్తున్న ప్రయాణికులు, స్థానికులు ఆ బ్యానర్లను ఆసక్తిగా తిలకించడం కనిపించింది. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే తరహాలో ప్రచారం నిర్వహించి బీజేపీ, ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలను ఎక్కుపెట్టింది. బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా అంటూ సిద్దిపేటలోనూ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com