CM Revanth : సీఎం రేవంత్‌కు మహిళలంటే గౌరవం.. లేడీ ఎమ్మెల్యేల ప్రకటన

CM Revanth : సీఎం రేవంత్‌కు మహిళలంటే గౌరవం.. లేడీ ఎమ్మెల్యేల ప్రకటన
X

కాంగ్రెస్ తో పాటు.. సీఎం రేవంత్ రెడ్డికి ( Revanth Reddy ) మహిళలంటే గౌరవం ఉందని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, నారాయణపేట ఎమ్మెల్యే చిటైం పర్ణికా రెడ్డిలు బుధవారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు సభలో ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే క్యాబినెట్ మంత్రులుగా పనిచేస్తున్న మహిళలతో సహా ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు.

శాసనసభలో ఎవరిని అవమానించలేదని, గందరగోళం సృష్టించి సభను తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతో బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో సబితారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను అవమానించినట్లు గగ్గోలు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. క్లాస్ రూమ్ లో పిల్లలు చప్పట్లు కొట్టినట్టుగా బీఆర్ఎస్ నాయకులు సభలో ప్రవర్తిస్తున్నారన్నారు. సీతక్కకు అవగాహన లేదు అన్న కూడా తాము హుందాగా ఉన్నామన్నారు. రుణమాఫీని బీఆర్ఎస్ పార్టీ జీవించుకోలేకపోతుందన్నారు. అందుకే సభలో చిల్లరగా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఎవరు ఎంత అడ్డం పడ్డా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సభలో బీఆర్ఎస్ నేతలకు తగినంత సమయం ఇచ్చినా, మర్యాద పాటించలేదని వాపోయారు. బీఆర్ఎస్ సభ్యులు సభలో కాంగ్రెస్ పై కుట్రపన్ని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్జెక్టుపై మాట్లాడితే అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.

Tags

Next Story