తెలంగాణలో మరోసారి విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1914 కేసులు నమోదు

తెలంగాణలో మరోసారి విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1914 కేసులు నమోదు
తెలంగాణలో ఇప్పటి వరకు 17 వందల 34 కరోనా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 11 వేల 617 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 19 వందల 14 కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారిన పడి ఐదుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో 3 లక్షల 16 వేల 649కి కరోనా కేసులు చేరాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 17 వందల 34 కరోనా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 11 వేల 617 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 3 లక్షల 3 వేల 298 మంది కోలుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 393 కరోనా కొత్త కేసులు నమోదవగా.. మేడ్చల్‌లో 205, రంగారెడ్డిలో 169, నిజామాబాద్ జిల్లాలో 179 కేసులు నమోదయ్యాయి.


Tags

Read MoreRead Less
Next Story