తెలంగాణలో లక్ష 50 వేల మార్కు దాటిన కరోనా కేసులు
By - shanmukha |10 Sep 2020 4:56 AM GMT
తెలంగాణాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంట్లలో కొత్తగా 2,534 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంట్లలో కొత్తగా 2,534 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య లక్ష 50వేల మార్కు దాటింది. మొత్తం కరోనా కేసులు 1,50,176గా నమోదయ్యాయి. తాజాగా 11 మందిని ఈ మహమ్మారి బలితీసుకోగా.. మొత్తం మృతుల సంఖ్య 927కు చేరింది. అయితే, కరోనా నుంచి ఇప్పటివరకూ 1,17,143 మంది కోలుకోగా.. ఇంకా 25,066మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.61శాతంగా నమోదవ్వగా.. రికవరీ రేటు 78శాతంగా ఉంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com