Couple Commits Suicide : రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్య

Couple Commits Suicide : రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్య
X

స్టేషన్ ఘన్ పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట రైలు క్రింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నమిలిగొండ గ్రామానికి చెందిన కోటి వినయకుమార్ (25), మచ్చశృతి (23) ఇరువురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి ఇండ్లు ఒకే వీధిలో ఉంటాయి. ఇరువురు కూడా డిగ్రీ వరకు చదువుకుని ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా ఇరువురు ప్రేమించుకుంటున్నారు. ఇరువురి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోవడం వల్ల చేసేది లేక సోమవారం ఉదయం భువనగిరి జిల్లా కేంద్రంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న రైలుకు అడ్డంగా నిలుచోగా ఢీకొన్న ఈ ఘటనలో ఇరువురు మృతిచెందారు. మృతదేహాలను సాయంత్రం గ్రామానికి తీసుకు రాగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

Tags

Next Story