Covid - 19 : శంషాబాద్ ఎయిర్పోర్టులో కరోనా టెస్ట్లు

X
By - Vijayanand |1 April 2023 7:15 AM IST
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టులోమళ్లీ కరోనా టెస్ట్లు చేస్తున్నారు. ఇందుకోసం థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ విమాన సర్వీసుల ద్వారా శంషాబాద్కు వస్తున్న ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తున్నారు.ప్రతి వంద మంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో అనుమానం ఉన్న ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్న ప్రయాణికులకు ప్రస్తుతం కొవిడ్ పరీక్షలు, ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదన్నారు. అయితే, కరోనా లక్షణాలున్న ప్రయాణికులు మాత్రం విధిగా మాస్క్ ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com