TG : రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు : కోదండరెడ్డి

X
By - Manikanta |10 Oct 2024 5:00 PM IST
రైతు డెవలప్ మెంట్ కు రెండు సూత్రాలు పెట్టుకొని ముందుకు వెళ్తున్నామని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన బీఆర్కే భవన్లో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయం, రైతు సంక్షేమం అని రెండుగా విభజించుకుని ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు వెళ్తుందన్నారు. రైతుకి ఒకప్పుడు సమాజంలో బాగా గౌరవం ఉండేదని, కానీ గడిచిన పదేళ్లలో ఈ పరిస్థితులు కానరావడం లేదన్నారు. రైతు తనకు గిట్టుబాటు ధర రాక, పెట్టుబడి పెరిగి అనేకమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సాహసోపేతమైన, ఆర్థికపరమైన నిర్ణయం తీసుకొని ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేశారన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com