TG Deputy CM : నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం .. రైతులను నష్టం చేస్తే ఊరుకోం : డిప్యూటీ సీఎం

TG Deputy CM : నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం .. రైతులను నష్టం చేస్తే ఊరుకోం : డిప్యూటీ సీఎం
X

వ్యాపార ప్రయోజనాల కోసం రైతులకు నష్టం చేస్తే ఊరుకునేది లేదని, నకిలి విత్తనాలు చెలామణి కాకుండా ఉక్కుపాదం తో అణిచివేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అక్రమార్కులపై క్రిమినల్కేసులను నమోదు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి సప్లై అయ్యే అవకాశంపై ప్రభుత్వం తరుఫున అక్కడి ప్రభుత్వంలో మాట్లాడి కట్టడి చేస్తా మన్నారు. ఇవాళ ఖమ్మం కలెక్టరేట్ లో జిల్లా ఉన్నతాధికారులతో జిల్లా ఇన్చార్జి మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీ ముత్యము శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు తీసుకుని వచ్చి అమ్మే పై వారిపై సీరియస్ గా దృష్టి పెట్టి, వారి పై చర్యలు తీ సుకోవాలన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడు తూ.. ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా చూడాలని.. దానికి కలెక్టర్లే బాధ్యత అని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. శంషాబాద్ అడ్డాగా నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నారని తెలిపారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... జూన్ 2న ప్రభుత్వ భూమిలో సాగు చేసే రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చే ఆలోచన చేస్తోందన్నారు. వైలెట్ ప్రాజెక్టు లో భూభారతిలో చిన్న లోపం జరగకూడదన్నా రు. తహశీల్దార్లు రైతుల ను ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. భూ భారతి అమలు నేపథ్యంలో వచ్చే నెల 3 - 28 వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు లు లేవన్నారు. పేదల కోసం అకింతభావంతో పనిచేయా లని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇంటికి రూ. 5 లక్షల ఇవ్వడం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక మాఫియా, ఐరన్ మాఫియా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags

Next Story