TG : లక్ష్మీదేవి బొమ్మ ఉన్న పటాకులు కాల్చొద్దు.. రాజాసింగ్ పిలుపు

X
By - Manikanta |31 Oct 2024 5:45 PM IST
పటాకులు కాల్చడంలో పద్ధతులు పాటించాలని కోరారు గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్. లక్ష్మీ దేవిని కొలిచే దీపావళి రోజు అమ్మవారి బొమ్మతో ఉండే ఏ పటాకాను కాల్చవద్దన్నారు రాజాసింగ్. ఎన్నో ఏళ్లుగా లక్ష్మీదేవి ఫోటోతో పటాకాలు కాల్చుతున్నారని, ఈసారి సంకల్పం తీసుకుని వాటిని కొనకుండా ఉండాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచైనా అలాంటి టపాకులు తయారు చేయకుండా ఉంటారన్నారు. ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకోవాలన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com