HYDRA : హైడ్రా పేరుతో హైడ్రాలొద్దు .. హామీల అమలు చేతగాక అది తెచ్చారు

X
By - Manikanta |27 Aug 2024 11:00 AM IST
రైతు రుణమాఫీ పేరుతో రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. ఎన్నికల కోసమే హైడ్రా ఏర్పాటైందా అని, ప్రభుత్వాలు మారితే ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు గుర్తొస్తాయా అని ఆయన అన్నారు. ప్రభుత్వ పనితీరును హైప్ చేయడానికే హైడ్రా అని, హైడ్రా పేరుతో హైడ్రామా వద్దన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక ఇలాంటివి తెరమీదకు తీస్తున్నారని, హైడ్రా వెనుక ఏదో దాగి ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాలను ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవాలని, 111 జీవో కొనసాగించాలన్నారు. హైదరాబాద్ లో హైడ్రా సరే కానీ మక్తల్ చెరువుల సంగతి ఏమిటని ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com