Telangana : దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్

తెలంగాణ లోని డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి 'దోస్త్' నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మూడు విడతల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించింది. ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో రూ. 200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చాన్స్ ఇచ్చింది. ఈ నెల 10 నుంచి 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. మే 29న ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్లో సీట్లు పొందిన విద్యార్థులు మే 30 నుంచి జూన్ 6వ తేదీలోపు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జూన్ 30 నుంచి డిగ్రీ ఫస్టియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. సెకండ్ఫజ్ : సెకండ్ ఫేజ్ దరఖాస్తుల ప్రక్రియ మే 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగనుంది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూన్ 13న రెండో దశ సీట్లు కేటాయించనున్నా రు. జూన్ 13 నుంచి 18వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com